మళ్లీ తమిళ బాట పట్టిన రష్మిక.. ఏకంగా మల్టీస్టారర్ ఛాన్స్ కొట్టేసింది?

by Dishanational2 |
మళ్లీ తమిళ బాట పట్టిన రష్మిక.. ఏకంగా మల్టీస్టారర్ ఛాన్స్ కొట్టేసింది?
X

దిశ, సినిమా:నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు తెలుగు, హిందీ సినిమాలతో కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. అయితే కొంతకాలంగా తమిళ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు త్వరలోనే విక్రమ్‌తో జోడీగా ఓ తమిళ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ ఓ మల్టీస్టారర్‌‌గా రాబోతుండగా కథ విని రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ‘2018’ చిత్రంతో దక్షిణాది పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన మలయాళీ దర్శకుడు జాడ్‌ ఆంథోని జోసెఫ్‌.. ఈ నయా మూవీకి దర్శకత్వం వహించనుండగా లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో విక్రమ్‌తో పాటు మరో యువహీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సుల్తాన్‌, వారిసు వంటి తమిళ చిత్రాల్లో నటించిన రష్మిక సుదీర్ఘ విరామం తర్వాత తమిళంలో నటించబోతున్న చిత్రమిదే కావడం విశేషం.

Read More: మీతో ఉండి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులను అసలు ప్రేమించకండి.. దీపికా పదుకొనె పోస్ట్

Next Story

Most Viewed